surya
Home » ఇంట్రెస్ట్‌ లేకనా? సూర్యకు అవమానమా?

ఇంట్రెస్ట్‌ లేకనా? సూర్యకు అవమానమా?

by admin
0 comment

ఫైనల్లో ఓడి వన్డే వరల్డ్‌ కప్‌ను చేజార్చుకున్న టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ రోజు విశాఖపట్నం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కేవలం ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే వచ్చారంట. సాధారణంగా క్రికెట్‌ను మతంగా భావించే మన దేశంలో టీమిండియా కెప్టెన్‌ నిర్వహించే ప్రెస్‌మీట్‌ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు. కానీ సూర్యకుమార్‌ కెప్టెన్‌గా నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌కు ఎవరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అయితే కప్‌ కోల్పోయిన బాధ, అలాగే స్టార్‌ ప్లేయర్లు ఈ సిరీస్‌కు దూరమవ్వడం.. వంటి కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని నెట్టింట్లో చర్చ సాగుతోంది. మరోవైపు ఫైనల్లో జట్టును ఆదుకోవాల్సిన టైమ్‌లో సూర్యకుమార్‌ పేలవ షాట్‌తో పెవిలియన్‌కు చేరాడని, అందుకే సూర్య ప్రెస్‌మీట్‌పై ఎవరికీ ఆసక్తి లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links