crime
Home » crime: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని చెల్లిని చంపిన అన్న

crime: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని చెల్లిని చంపిన అన్న

by admin
0 comment

సామాజిక మాధ్యమాల్లో చెల్లి చురుగ్గా ఉంటుందని ఆగ్రహించిన అన్న ఘూతుకానికి పాల్పడ్డాడు. రోకలి బండతో బాది కిరాతకంగా చంపాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది.

రాజీవ్‌నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్‌ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్‌ ఉన్నారు. మహబూబాబాద్‌లో ఏఎన్‌ఎం అప్రెంటిస్‌ చేస్తున్న సింధు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవారు. అయితే ఇది నచ్చని హరిలాల్‌ ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో హరిలాల్‌ కోపంతో రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ తీసుకెళ్తుండగా మృతిచెందారు.

అయితే చంపిన విషయం బయటకు రానివ్వకుండా మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటికే హరిలాల్‌ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links