ombirla
Home » No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్‌

No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్‌

by admin
0 comment

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అనుమతిచ్చారు. అన్ని పార్టీలతో సంప్రదించి, తగిన సమయం ఇస్తామని ప్రకటించారు. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్‌ డిప్యూటి నేత గౌరవ్‌ గొగొయి స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గౌరవ్‌తో పాటు భారాస ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు.

మణిపుర్‌ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీతో ఎలాగైనా మాట్లాడించాలని విపక్ష కూటమి ‘ఇండియా’ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం బుధవారం ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’ కూటమికి 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. మణిపుర్‌ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links