governor
Home » RTC బిల్లుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

RTC బిల్లుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

by admin
0 comment

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం కాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది.

కాగా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే ఇది మనీ బిల్లు కావడంతో గవర్నర్‌ అనుమతి కోసం ఈనెల 2న మధ్యాహ్నం ముసాయిదా బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు. దీనిపై కొన్ని సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్‌ కార్యాలయం వివరణ కోరగా, ప్రభుత్వం వాటికి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links