gold
Home » మియాపూర్‌లో 17 కిలోల బంగారం సీజ్‌

మియాపూర్‌లో 17 కిలోల బంగారం సీజ్‌

by admin
0 comment

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. సరైన ప్రతాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మియాపూర్‌లో చేసిన తనిఖీలో ఏకంగా 17 కేజీల బంగారం, 17.5 కిలోల వెండీని సోమవారం సీజ్‌ చేశారు. వాటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. మరోవైపు గాంధీనగర్‌ పరిధిలోని కవాడీగూడలో రూ.2.09 కోట్లు, వనస్థలిపురంలో రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అయ్యప్ప సొసైటీలో రూ.32 లక్షల నగదు, గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలో రూ.10 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links