iphone
Home » Delhi: ఐఫోన్‌ కోసం రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

Delhi: ఐఫోన్‌ కోసం రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

by admin
0 comment

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఐఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఫోన్‌ను దొంగలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు యొవికా చౌదరి దక్షిణ దిల్లీలోని జ్ఞాన్​ భారతి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఆమె ఆటోలో ఇంటికి పయనమయ్యారు. అయితే​ ఆమె వద్ద ఉన్న ఐఫోన్‌ను గమనించిన దుండగులు దానిని చోరీ చేసేందుకు ఓ ప్లాన్‌ వేశారు. ఆటోలో వెళ్తోన్న ఆమెను రెండు బైక్‌లపై వెంబడించి ఫోన్‌ను లాక్కోవాలని యత్నించారు.

కానీ యొవికా ప్రతిఘటించడం వల్ల జరిగిన పెనుగులాటలో ఆమె ఆటో నుంచి కిందపడిపోయారు. అక్కడితో వదలని దుండగలు ఆ ఫోన్‌ కోసం ఆమెను రోడ్డుపై అలాగే ఈడ్చుకెళ్లారు. వారితో పోరాడలేని ఆమె ఫోన్‌ను వదిలేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links