meenakshi
Home » Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by admin
0 comment

లోక్‌సభలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ గురించి గురువారం చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విపక్ష నేతలను ఉద్దేశించి మీ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ (ఈడీ) వస్తుందని ఆమె హెచ్చరించారు.

‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’పై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ ”నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ అధికారులు రావాల్సి ఉంటుంది” అని ఆమె హెచ్చరించారు. దీనిపై వివక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తాము చెప్పిన మాటలు ఇప్పుడు రుజువయ్యాయని విపక్షాలు దుయ్యబట్టాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links