bridge
Home » Video- కూలిన వంతెన.. పరిగెత్తుతూ ప్రాణం వదిలాడు

Video- కూలిన వంతెన.. పరిగెత్తుతూ ప్రాణం వదిలాడు

by admin
0 comment

గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని, అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. వంతెన కూలిపోవడాన్ని గమనించిన అతడు వేగంగా పరిగెత్తాడు. కానీ కాంక్రీట్ స్లాబులు అతడిపై పడిపోవడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యం అందర్నీ కలచివేస్తోంది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వాటికింద చిక్కుకుపోయినట్లు ఘటనా స్థలంలోని వ్యక్తులు చెప్పారు. ఆటోతో పాటు ట్రాక్టర్ కూడా వాటికింద నుజ్జునుజ్జు కావడంతో వారు కూడా చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇది పాలన్‌పుర్‌-అంబాజీని అనుసంధానించే రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌. పాలన్‌పుర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ వంతెనకు ఇటీవలే ఆరు కాంక్రీట్‌ స్లాబులు అమర్చారు. అవి సోమవారం కూలిపోయాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links