train
Home » Tamil Nadu Train accident – ఘోర రైలు ప్రమాదం

Tamil Nadu Train accident – ఘోర రైలు ప్రమాదం

by admin
0 comment

తమిళనాడులో (Tamil Nadu) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న IRCTC స్పెషల్‌ ట్రైన్‌ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.  రైల్లోకి అనుమతి లేకుండా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రైవేటు పార్టీ కోచ్‌ ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శుక్రవారం నాగర్‌కోయిల్ జంక్షన్‌ వద్ద దీన్ని పునలూరు-మదురై ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అటాచ్‌ చేశారు. నిన్న రాత్రి మదురై రైల్వే స్టేషన్‌ వద్ద దీన్ని డిటాచ్‌ చేసి స్టాబ్లింగ్‌ లైన్‌లో నిలిపి ఉంచారు.

అయితే ఈ ప్రైవేట్‌ పార్టీ కోచ్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అనుమతి లేకపోయినా రైల్లోకి గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున దానిపై టీ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే బోగీ అంతా మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి కిందకు దిగారు. ప్రమాద సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links