gambhir
Home » పాకిస్థాన్‌కు వేరే పని లేదా?- గంభీర్‌

పాకిస్థాన్‌కు వేరే పని లేదా?- గంభీర్‌

by admin
0 comment

ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమిపాలవ్వడంపై పాకిస్థాన్‌ జట్టు ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకోవడాన్ని గౌతం గంభీర్‌ తీవ్రంగా ఖండించాడు. ”అభిమాన జట్టు గెలిస్తే సెలబ్రేషన్స్‌ చేసుకోవాలి. అంతేకానీ ఇతర జట్లు ఓడిపోతే అలా చేయడమేంటి? అది మేనర్స్‌ కాదు, నెగెటివ్‌ యాటిట్యూడ్‌. ఈ విధానాన్ని వీడాలి. ఎట్‌లీస్ట్‌ స్పోర్ట్స్‌ రిలేటెడ్‌ విషయాల్లోనైనా ఇలా ఉండకూడదు. అయినా అలా చేస్తే ఏం యూజ్‌ ఉంటుంది? వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉంటుంది. ఆ టైమ్‌కు భారత్‌-పాకిస్థాన్‌ తలపడతాయి. అప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. ఆ టైమ్‌కు చేసుకుంటే ఓ అర్థముంటుంది. కానీ ఇలా ఇతర టీమ్స్‌ ఓడిపోవడంపై సంబరాలు ఎప్పటికీ చేయకూడదు” అని పాక్‌ అభిమానులను ఉద్దేశించి గంభీర్‌ మాట్లాడాడు. అలాగే ఇతర జట్ల చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోయినప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ కూడా పాక్‌ను ట్రోల్‌ చేయొద్దని అన్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links