bus accident
Home » Paderu: పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు

Paderu: పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు

by admin
0 comment

అల్లూరి జిల్లాలోని పాడేరు (Paderu) ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వ్యూపాయింట్‌ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. పల్టీలు కొట్టి 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. లోయలో పడిన ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. అతికష్టం మీద ప్రయాణికులను ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. మరో ఆర్టీసీ బస్సులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చెట్టు కొమ్మను తప్పించబోయి ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links