women
Home » Women reservation bill- రాష్ట్రపతి ఆమోదం

Women reservation bill- రాష్ట్రపతి ఆమోదం

by admin
0 comment

పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లును సెప్టెంబర్ 19న లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. చర్చ అనంతరం లోక్‌సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. అనంతరం సెప్టెంబర్ 21న రాజ్యసభలోనూ ప్రవేశపెట్టగా బిల్లు ఆమోదం పొందింది. నేడు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. అయితే బిల్లు చట్టం రూపం దాల్చినప్పటికీ తక్షణం అమల్లోకి వచ్చే అవకాశాలు లేవు. జనగణన, డీలిమిటెషన్ తర్వాత చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. 2024 ఎన్నికలు అనంతరం జనగణన ప్రారంభిస్తారు. ఇక డీలిమిటేషన్ ప్రక్రియ 2026 తర్వాత జరగనుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links