lottery
Home » Punjab- రూ.100 ఖర్చుపెట్టి కోటీశ్వరులయ్యారు

Punjab- రూ.100 ఖర్చుపెట్టి కోటీశ్వరులయ్యారు

by admin
0 comment

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్​షిప్​లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్​ ప్రైజ్​మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్​కు చెందిన రమేశ్​, కుకీ గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. అయితే ఇటీవల రెండు రూ.100 టికెట్లు కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి లాటరీ ఫలితాలు విడుదలవ్వగా ఓ టికెట్​కు రూ.కోటిన్నర లాటరీ తగిలింది. దీంతో కోటీశ్వరులు అయిపోయిన వారిద్దరూ బ్యాండుతో లాటరీ సెంటర్‌కు వచ్చారు. డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేశారు. లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, అధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తామని తెలిపారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links