amit shah
Home » హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి- అమిత్‌ షా

హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి- అమిత్‌ షా

by admin
0 comment

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొన్న అమిత్‌షా మాట్లాడారు. ”కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చి మోదీ.. తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు. గత పదేళ్లుగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. కేసీఆర్‌ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి రాష్ట్ర సర్కారు జాగా చూపించలేదు, అందుకే ఆలస్యమైంది. కేసీఆర్‌ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ అమలు చేయలేదు. ఆదివాసీలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. దళితులు, గిరిజనుల కోసం మోదీ తొమ్మిదేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోదీ రాష్ట్రపతిని చేశారు. కేసీఆర్‌ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు” అని అమిత్‌షా అన్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links