raghavendarrao
Home » డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

by admin
0 comment

బంజారాహిల్స్‌ సమీపంలోని షేక్‌పేట్‌లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్‌లో రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాయితీ ధరతో భూమిని కేటాయించగా వారు దాన్ని షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 18కి వాయిదా వేసింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links